తూర్పుగోదావరి : ఆలమూరు మండలం కలవచర్ల వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు పక్కన ఉన్న భారీ గడ్డివాము ప్రమాదవశాత్తూ దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఆలమూరు మండలం పెదపళ్ల కు చెందిన గుత్తుల అన్నవరం 9 ఎకరాల వరి చేనులో ఉన్న గడ్డిని గడ్డివాముగా ఏర్పాటు చేశారు. సోమవారం ఆ గడ్డివాములో అకస్మాత్తుగా మంటలు రాజుకోవడంతో.. స్థానికులు మండపేట అగ్నిమాపకదళం వారికి సమాచారాన్ని అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పెదపళ్ల సొసైటీ ప్రెసిడెంట్ నెక్కింటి వెంకటరాయుడు (పెదపళ్ల బుజ్జి) సంఘటన స్థలానికి చేరుకుని పర్యవేక్షించారు. ఆస్తి నష్టం లక్ష రూపాయల వరకు జరిగినట్లు అంచనా వేశారు.
Mon Jan 19, 2015 06:51 pm