రంగారెడ్డి: గుండ్ల పోచంపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభమైంది. కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లా రెడ్డి ప్రారంభించారు. గ్లాండ్ ఫార్మా లిమిటెడ్, అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యం లో విద్యార్థులకు అల్పాహారం పంపిణీ జరుగుతుంది. అక్షయ పాత్ర పేదలు, విద్యార్థుల ఆకలి తీరుస్తోందని మల్లా రెడ్డి అన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమానికి సహకరిస్తున్న గ్లాండ్ ఫార్మా యాజమాన్యానికి , అక్షయ పాత్ర సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపిపి పద్మజ జగన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అక్షయ పాత్ర ఫౌండేషన్ సభ్యులు,గ్లాండ్ ఫార్మా యాజమాన్యం,పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm