న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీని వేధిస్తున్న కాలుష్య సమస్యపై జరుగుతున్న సమావేశానికి హాజరు కానందుకు గంభీర్పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. గంభీర్ కనబడుటలేదు..చివరిగా అతడు జిలేబీలు తింటూ కనిపించాడుఁ అని రాసున్న పోస్టర్లు ఢిల్లీ వీధుల్లో దర్శనమిచ్చాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా కూడా చర్చ ప్రారంభమైంది. అయితే తాజాగా బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ దీనిపై స్పందించారు. ఆ సమావేశంలో తాను పాల్గొనకపోవడాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
నేను జిలేబీ తింటున్న ఫోటో బయటకు వచ్చిందో లేదో..అలా ట్రోల్ చేయటం ప్రారంభించారు. నేను జిలేబీలు తినటం మానేస్తే కాలుష్యం తగ్గుతుందా..అలా అయితే చెప్పండి వెంటనే నేను ఈ అలవాటును మానుకుంటా. నన్ను ట్రోల్ చేయడానికి పడ్డ కష్టంలో పదో వంతు కాలుష్యం నివారణపై పెట్టి ఉంటే ఈ పాటికి మనందరం స్వఛ్చమైనా గాలి పిలుస్తూ ఉండే వాళ్లం అని ఆయన వ్యాఖ్యానించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 18,2019 02:51PM