న్యూఢిల్లీ : ప్రజలందరూ కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ సమావేశాలకు ప్రకాశ్ జవదేకర్.. ఎలక్ట్రిక్ కారులో వచ్చారు. ఈ సందర్భంగా జవదేకర్ను మీడియా పలుకరించగా.. కాలుష్యాన్ని నివారించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలక్ట్రిక్ కార్లను క్రమక్రమంగా పెంచుతుందున్నారు. కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ పోరాడాలి, సహకరించాలని జవదేకర్ విజ్ఞప్తి చేశారు. ప్రజా రవాణాను, ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించుకోవాలని ప్రజలకు కేంద్ర మంత్రి సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm