ఢిల్లీ: రాజ్యసభ 250వ సమావేశంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), బిజు జనతాదళ్(బీజేడీ)పై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు. ఆ పార్టీలు ప్రజల హృదయాలను గెలుచుకున్నాయని, వారి నుంచి తనతో సహా ఇతర పార్టీల నేతలు ఎంతో నేర్చుకోవాలని కొనియాడారు. ఎన్సీపీ, బీజేడీ ఒక్కసారి కూడా వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేయలేదు. అయినప్పటికీ చర్చల సమయంలో వారు సమర్థవంతమైన అంశాలను లేవనెత్తుతారు. పార్లమెంట్ నిబంధనలకు ఈ పార్టీలు కట్టుబడిన తీరు అద్భుతం. వెల్లోకి దూసుకెళ్లనప్పటికీ వారు ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. బీజేపీ సహా ఇతర పార్టీల నేతలందరూ వారి నుంచి ఎంతో నేర్చుకోవాలని అని మోడీ ప్రశంసించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 18,2019 04:01PM