ఖానాపూర్, : రాష్ట్రంలో గత 45 రోజులుగా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నప్పటికి ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ కడపత్రి తిలక్రావు పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 19న సడక్బంద్ చేపట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపాలన్నారు. అఖిలపక్ష నాయకులు ఏకదాటిపైకి వచ్చి ముమ్మరంగా ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపాలన్నారు. అలాగే ఈ నెల 22, 23 తేదీల్లో రైతులు, రైతు కూలీలు గిట్టుబాటు ధర,పత్తి రైతులకు ప్రభుత్వం నుండి అందించాల్సి సబ్సిడీ , పంట నష్టంపై వివరాలు తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుందన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో టీజేఎస్ నాయకులు అజయ్, పానగంటి నాగరాజు, మునిగడవు శేఖర్, దాసరి శ్రీనివాస్, కలమడుగు శేషుకుమార్ఒ, తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm