హైదరాబాద్: ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ను(90) కొద్ది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు కూడా వెల్లడించారు. అయితే... కొన్ని వెబ్సైట్స్ లతా మంగేష్కర్ కన్నుమూశారని ప్రచారం చేశాయి. ఆమె చనిపోయినట్టుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వార్తలను వండివార్చాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు స్పందించారు. ఆమె కోలుకుంటున్నారని.. చనిపోయినట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అభిమానులను కోరారు. ఆ వార్తలన్నీ నిరాధారమైనవని కొట్టిపారేశారు. ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గొయెంకా కూడా లతా మంగేష్కర్ ఆరోగ్యానికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు. అమెరికాలోని క్లీవ్లాండ్ క్లినిక్కు చెందిన వైద్య బృందం లతా మంగేష్కర్కు చికిత్సనందిస్తున్నారని ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని ఆయన ట్వీట్ చేశారు. నవంబర్ 11న లతా మంగేష్కర్ శ్వాస సంబంధ సమస్యను ఎదుర్కోవడంతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి ఆమెను తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్సనందిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 18,2019 05:05PM