హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి గేటు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో న్యాలట గ్రామానికి చెందిన ఆలూరు గ్రామానికి చెందిన రాజు రెండేళ్ల కూతురు, చెనోళ్ల నర్సింహులు మృతి చెందగా, రాజు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm