హైదరాబాద్: గాంధీలో ఇద్దరికి స్వైన్ప్లూకు చికిత్స పోందుతున్నారు. వాతావరణంలో మార్పు కారణంగా మళ్లీ స్వైన్ఫ్లూ విజృంబిస్తోంది. పెద్ద అంబర్పేట్ సాయినగర్కు చెందిన 45 ఏళ్ల మహిళ హయత్నగర్ అమ్మ ఆస్పత్రి నుంచి నవంబర్ 30న వైద్య పరీక్షల నిమిత్తం గాంధీలో చేరారు. అదే విధంగా మెదక్ టేక్మల్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల యువకుడు మెదక్లోని ఓ ప్రవేట్ ఆస్పత్రి నుంచి ఈనెల 2న గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతం వీరిరువురూ స్వైన్ఫ్లూతో చికిత్స పొందుతున్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ శ్రావణ్ కుమార్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm