విజయవాడ: భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలన సబ్ కా వినాశ్లా సాగుతోందని తులసిరెడ్డి మండిపడ్డారు. దేశంలో 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందని, రాష్ట్రానికి బీజేపీ తీరని ద్రోహం చేసిందని తులసిరెడ్డి ఆరోపించారు. బీజేపీతో చేతులు కలపడానికి జనసేన, వైసీపీ, టీడీపీ పాకులాడటం శోచనీయమని తులసిరెడ్డి అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm