హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొబైల్స్ తయారీదారు వన్ప్లస్.. రిపబ్లిక్ డే సేల్ను నిర్వహిస్తున్నది. ఈ సేల్ ఇవాళ ప్రారంభం కాగా ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా వన్ప్లస్ ఫోన్లను తగ్గింపు ధరలకే వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. వన్ప్లస్ 7 ప్రొ, 7టి ఫోన్లపై ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో రూ.3వేల వరకు క్యాష్బ్యాక్ను అందిస్తున్నారు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ విధానంలోనూ ఈ ఫోన్లను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఇక వన్ప్లస్ టీవీలను కూడా ఈ సేల్లో తగ్గింపు ధరలకు అందిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm