హైదరాబాద్: బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ రోడ్డు ప్రమాదంలో గాయపడి, ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వార్త తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు షబానా త్వరగా కోలుకోవాలని భగవంతుడిని వేడుకుంటున్నారు. ఈ నేపధ్యంలో గాయని లతా మంగేష్కర్ తన ట్విట్టర్లో 'షబానాకు యాక్సిడెంట్ అయిందని తెలుసుకోగానే దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని రాశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు సంజయ్ నిరుపమ్, జయంత్ పాటిల్ కూడా షబానా త్వరగా కోలుకోవాలని అభిలషించారు. కాగా షబానా ఇటీవలే తన భర్త జావేద్ అక్తర్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm