హైదరాబాద్: తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ 3వ రాష్ట్ర మహాసభలను ఫిబ్రవరి 11వ తేదీన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహిస్తున్నామని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.విఠల్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. నారాయణ రెడ్డిలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగంలో పనిచేసే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మహాసభల్లో చర్చించనున్నట్లు తెలిపారు. మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను సోమవారం హిమాయత్ నగర్లోని ఎస్ఎన్రెడ్డి భవన్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు సత్యనారాయణరెడ్డి, భీంరావ్ పాటేల్, శ్రీనివాస చారి, వి.వేణుకుమార్, యన్.శ్రీనివాస్, సురేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm