హైదరాబాద్ : సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) అఖిల భారత 16వ మహాసభలకు ఆతిథ్యం ఇచ్చేందుకు చెన్నై నగరం ముస్తాబయ్యింది. ఈ మహాసభలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 27 వరకూ జరుగనున్నాయి. సీఐటీయూ అఖిల భారత మహాసభలకు చెన్నై నగరం ఆతిథ్యం ఇవ్వటం ఇది మూడోసారి. సీఐటీయూ అఖిల భారత నాలుగో మహాసభలు 1979 ఏప్రిల్లో మద్రాస్ నగరంలో జరిగాయి. ఇప్పుడు 16వ అఖిల భారత మహాసభలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని సీఐటీయూ తమిళనాడు రాష్ట్రం మరోసారి దక్కించుకుంది. ఈ ఏడాది సీఐటీయూ స్వర్ణోత్సవ సంవత్సరంతో పాటు, తొలి కేంద్ర కార్మిక సంఘం ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏర్పడిన శత వార్షికోత్సవ సంవత్సరం కూడా కావటంతో ఈ 16వ మహాసభలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm