న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఆదివారం నిర్వహించబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ నేపధ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. భద్రతా కారణాల రీత్యా రేపు ఢిల్లీలోని కొన్ని మెట్రో స్టేషన్లు మధ్యాహ్నం 12 గంటల వరకూ మూతబడనున్నాయి. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ విషయాన్ని తెలియజేసింది. సచివాలయం నుంచి ఉద్యోగ్ భవన్ వరకూ గల మెట్రోలో మధ్యాహ్నం 12 వరకూ రాకపోకలు ఉండవు. అలాగే లోక్ కల్యాణ్ మార్గ్, పటేల్ చౌక్ మెట్రో స్టేషన్లను ఉదయం 8.45 నుంచి మధ్యాహ్నం 12 వరకూ మూసివేయనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm