హైదరాబాద్ : పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిన్న రాత్రి ట్యూషన్కు వెళ్లిన కొడుకు తెల్లాసరికి ఇక లేడన్న వార్తతో ఆ తల్లిదండ్రుల ఆవేదన అంతాఇంతాకాదు. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే...కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం జెడ్పీ ఉన్నత పాఠశాలలో దీపక్ పదో తరగతి చదువుతున్నాడు. నిన్న రాత్రి ఎప్పటిలాగే ట్యూషన్కు వెళ్లాడు. ఉదయం లేచేసరికి పాఠశాల ప్రాంగణంలో చీరతో ఉరేసుకుని కనిపించడంతో సిబ్బంది ఆశ్చర్యపోయారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలిని సందర్శించిన పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm