కొత్తగూడెం: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఏజెన్సీలో భద్రతా బలగాలపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. సుక్మా జిల్లా కిస్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అంబుష్ వేసి సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న జవాన్లపై కాల్పులు జరిపారు. జవాన్లు కోలుకునేలోపే మాయిస్టులు విరుచుకుపడడంతో ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. జవాన్లు జరిపిన ఎదురుకాల్పులు తాళలేక మావోయిస్టులు కాల్పులు విరమించి పారిపోయారు. గాయపడిన జవాన్లను తోటి జవాన్లు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు. చికిత్సపొందుతూ ఒక జవాన్ పరిస్థితి విషమించి మృతి చెందగా, మరో జవాన్ విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకు సంబంధించినబ పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm