హైదరాబాద్: మరో మూడేళ్ల పాటు కూడా అన్ని ఫార్మాట్లలో ఆడనున్నట్లు విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. వెల్లింగ్టన్లో మీడియా వేసిన ప్రశ్నలకు కోహ్లీ సమాధానం ఇచ్చాడు. మూడేళ్ల తర్వాత ఏవైనా రెండు ఫార్మాట్లలో ఆడనున్నట్లు స్పష్టం చేశాడు. కోహ్లీ ఇప్పటికే 84 టెస్టులు, 248 వన్డేలు, 82 టీ20 మ్యాచ్లు ఆడాడు. వాటిల్లో 12457, 11867, 2794 రన్స్ చేశాడు. 2021 టీ20 వరల్డ్కప్ తర్వాత ఏదైనా ఫార్మాట్కు దూరం అవుతారా అని అడిగిన ప్రశ్నకు కోహ్లీ బదులిస్తూ.. మరో మూడేళ్ల వరకు అన్ని ఫార్మాట్లలో ఆడనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. శుక్రవారం నుంచి న్యూజిలాండ్తో తొలి టెస్టు జరగనున్న విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm