న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ స్వాతి మలివాల్ తన భర్త, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ కన్వీనర్ నవీన్ జైహింద్ నుంచి విడిపోయారు. అత్యంత పిన్న వయసులో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందిన స్వాతి... తన భర్తకు విడాకులు ఇస్తున్నట్టు ఇవాళ ట్విటర్లో ప్రకటించారు. దంపతులుగా తాము ఎదుర్కొన్నసమస్యలను చెబుతూ ఆమె భావోద్వేగంతో కూడిన సందేశాన్ని పోస్టు చేశారు. మీ రంగుల కల ముగియడం కంటే బాధాకరమైన సంగతి మరోటి ఉండదు. నా కల కూడా చెదిరింది. నేను, నవీన్ విడిపోయాం. మంచి మనసున్నవాళ్లు కూడా ఒక్కోసారి కలిసి ఉండలేరు. జీవితంలో నవీన్ను ఎప్పటికీ మిస్ అవుతాను. తమ లాంటి వాళ్లకు ఈ బాధను తట్టుకునే శక్తినిమ్మని భగవంతుడిని వేడుకుంటున్నాను అని ఆమె పేర్కొన్నారు. అయితే స్వాతి మాజీ భర్త ఇంకా దీనిపై స్పందించలేదు.
Mon Jan 19, 2015 06:51 pm