న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి తగ్గుతుండటంపై మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత నరేంద్ర మోడీ ప్రభుత్వం అసలైన సమస్యలను గుర్తించడం లేదన్నారు. సమస్యలను గుర్తించకపోతే, వాటికి విశ్వసనీయమైన పరిష్కారాలను కనుగొనడం కష్టమవుతుందని హెచ్చరించారు. ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా రాసిన పుస్తకం 'బ్యాక్స్టేజ్' ఆవిష్కరణ సందర్భంగా మన్మోహన్ సింగ్ మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం 'మందగమనం' అనే పదాన్ని అంగీకరించడం లేదని మన్మోహన్ సింగ్ అన్నారు. సమస్యలను గుర్తించకపోతే, దిద్దుబాటు చర్యలు తీసుకోవడం కోసం విశ్వసనీయమైన సమాధానాలను కనుగొనడం సాధ్యం కాదని, ఇది నిజంగా ప్రమాదకరమని హెచ్చరించారు. 'బ్యాక్స్టేజ్' గురించి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ఈ పుస్తకంలో యూపీయే ప్రభుత్వం గురించి మంచిగా రాయడంతోపాటు, దాని బలహీనతలను కూడా ప్రస్తావించారని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm