మేడ్చల్: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో అనే భయంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూభాష్నగర్ డివిజన్, సూరారం, దయానంద్ నగర్ కాలనీకి చెందిన స్వర్ణకళ, రాజేందర్ దంపతుల కూతురు కీర్తిప్రియా(17) ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతుంది. కాగా.. పరీక్షలకు గడువు సమీపిస్తున్న నేపధ్యంలో పరీక్షల్లో ఫెయిల్ అవుతానేనమో అని మానసిక ఒత్తిడికి లోనై కీర్తిప్రియా ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఇంటిపైకప్పు కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యు లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం గాంధీ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm