హైదరాబాద్: దేశంలో దళితులపై దాడులకు అంతులేకుండా పోతోంది. మొన్న నాగౌర్లో దళిత అన్నదమ్ములపై దాడి గురించి మరిచిపోకముందే రాజస్తాన్లో మరో ఘటన చోటు చేసుకుంది. గాడిదలను దొంగతనం చేశారనే అనుమానంతో ముగ్గురు దళితులను దారుణంగా చితకబాదారు. రాజస్తాన్లోని జైసల్మీర్లో ఆ ఘటన చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జైసల్మీర్లో ఈ నెల 15న గాడిదలు కనిపించకుండా పోయాయి. వాటిని ఓ ముగ్గురు దళితులు దొంగతనం చేశారనే అనుమానంతో వారిపై కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడిచేశారు. కర్రలతో కొట్టారు.. కాళ్లతో తన్నుతూ శునకానందం పొందారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఈ శనివారం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే బాధితులు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. అయినా పోలీసులు వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
కొత్త పెళ్లికూతురుని ఎత్తుకెళ్లిన యువకులు Click Here
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 24,2020 08:08AM