చిత్తూరు: చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని మామండూరు వద్ద వెంకటాద్రి ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలు కప్లింగ్ లింక్ ఊడిపోవడంతో ఇంజిన్ నుంచి ఏసీ బోగీలు విడిపోయాయి. ఇంజిన్ నుంచి జనరల్, స్లీపర్ బోగీలు అర కిలోమీటరుకు పైగా దూరంగా జరిగాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన రైల్వే సిబ్బంది మరమ్మతులు చేయడంతో రైలు బయలుదేరింది.
Mon Jan 19, 2015 06:51 pm