హైదరాబాద్: అమెరికాలోని లాస్ఏంజెలెస్లో భారతీయుడు దారుణహత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. హర్యానాలోని కర్నాల్కు చెందిన మణిందర్ సింగ్ సాహి లాస్ ఏంజెలెస్లోని ఓ స్టోర్లో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో మణిందర్ స్టోర్లో ఉండగా గుర్తు తెలియని దుండగుడు మాస్క్ ధరించి స్టోర్లోకి చొరబడ్డాడు. ఆ సమయంలో ఉన్న ఇద్దరు కస్టమర్లకు ఏ హానీ తలపెట్టని దుండగుడు మణిందర్పై మాత్రం కాల్పులు జరిపాడు. అనంతరం డబ్బులు తీసుకుని పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన మణిందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గత నెలలో ఇండియాకు వచ్చిన మణిందర్.. అదే నెల చివరిలో తిరిగి అమెరికా చేరుకున్నాడు. అంతలోనే ఈ ఘోరం జరిగింది. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు మణిందర్ సోదరుడు తెలిపాడు.
Mon Jan 19, 2015 06:51 pm