గుంటూరు: వినుకొండ మండలం పిట్టబండలో దళితుల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని దళిత రైతులు అడ్డుకున్నారు. పోలీసులతో బలవంతంగా స్థలాన్ని చదును చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబం అడ్డుకోగా.. పోలీసులు, రెవెన్యూ అధికారులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో బాధిత కుటుంబాన్ని బలవంతంగా పోలీసు జీపులో ఎక్కించి పోలీసులు ఊరు బయట విడిచి పెట్టారు. పొలానికి అడ్డువస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించారు. అధికారుల దౌర్జన్యంతో బాధిత కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
Mon Jan 19, 2015 06:51 pm