జింబాబ్వే: బురదలో పడి బయటకు రాలేక విలవిల్లాడుతున్న ఆ గున్న ఏనుగును.. హైనాలు బతికుండగానే తినేశాయి. వాటి పదునైన పళ్లతో కాళ్లు, తొండాన్ని పీక్కుని తినేసి నరకాన్ని చూపించాయి. ఈ ఘటన జింబాబ్వే అడవుల్లో చోటుచేసుకుంది. జర్మనీకి చెందిన వైల్డ్ ఫొటోగ్రాఫర్ జెన్స్ కల్మాన్ తీసిన ఈ చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాలు జంతు ప్రేమికుల గుండె కరిగిస్తున్నాయి. బురదలో ఇరుక్కుపోయిన ఏనుగు పిల్లను బయటకు తీయడానికి తల్లి ఏనుగు ఎంతో ప్రయత్నించింది. ఇది గమనించిన హైనాలు అటువైపుకు రావడం చూసిన తల్లి ఏనుగు.. పిల్ల ఏనుగు కనిపించకుండా బురదని దాని ముఖం మీద వేసింది. అయినా సరే, ఫలితం దక్కలేదు. హెన్నాలు తల్లి ఏనుగును తరిమేసి పిల్ల ఏనుగును పట్టుకున్నాయి. క్షణాల్లో పిల్ల ఏనుగు శరీరాన్ని చిధ్రం చేశాయి. దొరికిన భాగాలను నోట కరుచుకుని పరుగులు పెట్టాయి. ఈ చిత్రాలను చూసిన నెటిజనులు.. పాపం ఆ క్షణంలో అది ఎంత నరకం అనుభవించి ఉంటుందో అని బాధను వ్యక్తం చేస్తున్నారు.
ఇతను మనిషి కాదు రాక్షసుడు.. ప్రత్యర్థి రక్తం నాకిన బాక్సర్: Video Click Here
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 24,2020 10:52AM