రంగారెడ్డి: భార్యను హతమార్చి.. భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీసుస్టేషన్ పరిధిలోని చిప్పలపల్లిలో జరిగింది. చిప్పలపల్లి గ్రామానికి చెందిన కాసోజు జంగయ్యచారి(45), కృష్ణవేణి(40) దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురు కుమార్తెలకు వివాహం కాగా.. నాలుగో కుమార్తెతో కలిసి గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. ఆదివారం కుమార్తె బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో జంగయ్యచారి మద్యం మత్తులో గునపంతో భార్య కృష్ణవేణిని పొడిచి హతమార్చాడు. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు ఉదయం ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm