న్యూఢిల్లీ : కేంద్ర పర్యావరణ, సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్పై ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ మండిపడ్డారు. ప్రజల డిమాండ్పై రామయణం సీరియల్ను శనివారం నుంచి దూరదర్శన్లో తిరిగి ప్రసారం చేస్తున్నట్లు కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపిన విషయం తెలిసిందే. ఈ సీరియల్ ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 10 వరకు ఒక ఎపిసోడ్, ఆ తర్వాత రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు మరో ఎపిసోడ్ను ప్రసారం చేస్తారు. తొలిసారి రామయణం సీరియస్ 1987 నుంచి 1988 మధ్య కాలంలో దూరదర్శన్లో ప్రసారం అయింది. నేడు ప్రారంభమైన ఈ సీరియల్ను తాను చూస్తున్నట్లు మరి మీరు అని ప్రజలను అడుగుతూ ప్రకాశ్ జవదేకర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై ప్రశాంత్ భూషన్ మండిపడ్డారు. దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు. స్వస్థలాలకు చేరుకునేందుకు ప్రజలు వందల మైళ్లు కాలినడకన ప్రయాణిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మన కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాత్రం ప్రజలకు రామాయణ, మహాభారతాన్ని మత్తుమందు వలె ఎక్కిస్తున్నారని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm