గాంధీనగర్: దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ను దిక్కరించి పోలీసులపై దాడి చేసినందుకు గాను 93 మంది వలస కూలీలను అరెస్ట్ చేసినట్లు గుజరాత్ పోలీసులు తెలిపారు. గుజరాత్లోని సూరత్ నగరంలో సోమవారం జరిగిందీ సంఘటన. సూరత్లోని గణేష్ నగర్, తరుపతి నగర్లలో పరిస్థితి తీవ్రంగా మారింది. దీంతో అక్కడ నివాసం ఉంటున్న 500 మంది వలస కూలీలు సొంతూళ్లకు ప్రయాణం అయ్యారు. ఆ సమయంలో పోలీసులకు వలస కూలీలకు మద్య గొడవ జరిగింది. అయితే ఇందులో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, బిహార్ల నుంచి వచ్చిన వారే. వీరు టెక్స్టైల్, పవర్లూమ్స్ సహా ఇతర పనులు చేసేవారు.
ఈ విషయమై స్థానిక పోలీసు అధికారులు మాట్లాడుతూ 'ఇళ్లకు బయల్దేరిన వారికి నచ్చజెప్పే ప్రయత్నం పోలీసులు చేశారు. అయితే పోలీసుల మాట వినకపోగా వారిపైనే దాడి చేశారు. ఇందులో పలు పోలీసు వాహనాలు ధ్వంసం అయ్యాయి' అని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Mar 30,2020 09:00PM