నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల భవనంలో ఇతర ప్రాంతాల నుండి తమ సొంత ప్రాంతాలకు వెళుతున్న వలస కార్మికులను పట్టుకొని ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వలస కూలీల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ నివారణకు లాక్ డౌన్ ఈనెల 15వ తేదీ వరకు ఉండడంతో వలస కూలీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి మౌలిక వసతులు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు గురుకుల పాఠశాలలో చేశామన్నారు. మండల పార్టీ నాయకులు వలస కూలీలకు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమానికి ప్రారంభించి స్వయంగా కూలీలకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, సర్పంచులు తునికి వేణు, జనగామ శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు భగవంత్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి నంద రమేష్, డిసిసిబి డైరెక్టర్ సిద్ధిరాములు, సొసైటీ చైర్మన్ భూమి రెడ్డి, భూమయ్య, రాజా గౌడ్ తో పాటు పార్టీ ఎంపీటీసీలు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Apr 01,2020 06:50PM