హైదరాబాద్ : మద్యం మత్తులో భార్య తన భర్తనే హతమార్చిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోనికోవైలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో వివాహితను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలలోకి వెళ్తే సేలం జిల్లా కాక్కాపాళయం సమీపం నడువనేరియ ప్రాంతానికి చెందిన అన్నామలై (35) భార్య ప్రియ (32) అనే భార్యభర్తలు కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇద్దరికీ మద్యం తాగే అలవాటు ఉండటంతో ఇంట్లోనే ఇద్దరు కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో వారి మధ్య ఏర్పడిన చిన్న వివాదం ఘర్షణకు దారితీసింది. ప్రియ కోపంతో భర్తను నెట్టివేయడంతో అతను కిందపడి స్పృహ కోల్పోయాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న ప్రియ సమీపంలోని బండరాయిని భర్త తలపై వేసింది. మత్తు నుంచి తేరుకున్న తరువాత జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడి పడివున్న భర్తను గుర్తించి జల్లికోట గ్రామంలో ఉన్న అక్క భర్త సెల్వరాజ్కు విషయాన్ని తెలిపింది. అతను ప్రైవేటు అంబులెన్స్తో అక్కడకు చేరుకొని మృతిచెందిన అన్నామలైను సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు హత్యకు గురయ్యాడని గుర్తించి కోయంబత్తూర్ జిల్లా ఎస్పీ సుజిత్కుమార్కు సమాచారం అందించారు. ఎస్పీ ఉత్తర్వులతో కరుమత్తంపట్టి డీఎస్పీ బాలమురుగన్ నేతృత్వంలో పోలీసులు సేలం ప్రభుత్వాస్పత్రికి చేరుకొని విచారించారు. భర్త మైకంతో కిందపడి మృతిచెందాడని బుకాయించిన ప్రియను తమదైన శైలిలో విచారించడంతో విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనలో ప్రియ, ఆమెకు సాయం చేసిన సెల్వరాజ్ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm