హైదరాబాద్: శ్రామిక్ రైళ్ల ద్వారా స్వగ్రామాలకు చేరుకున్న 50మంది వలస కూలీలకు కరోనా సోకినట్లు స్థానిక అధికారులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన వలస కార్మికులు ఉపాధి కోసం పూణె నుంచి బస్తీకి జిల్లాకు వచ్చారు. లాక్ డౌన్ నేపథ్యంలో తిరిగి వారు మహారాష్ట్ర నుంచి తమ స్వస్థలమైన ఉత్తరప్రదేశ్కు చేరుకున్న 50 మంది వలస కార్మికులు కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు స్థానిక జిల్లా అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. దీనితో రాష్ట్రంలో కరోనా సోకిన వలస కార్మికుల సంఖ్య 109కి చేరింది. వలస కార్మికుల్లో కరోనా కేసుల సంఖ్య పెరగడం అక్కడి అధికారులు ఆందోళన చెందుతన్నారు. వివిధ రాష్ట్రాలనుంచి ఉత్తరప్రదేశ్కు తిరిగి వస్తున్న కార్మికుల సంఖ్య లక్షల్లో ఉండటంతో కేసులు సంఖ్య భారీగా పెరుగ వచ్చు అనే అంచనాలతో ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా వీరంతా దాదాపు 2 నెలల పాటు వేరు వేరు ప్రాంతాల్లో ఉండిపోయారని, దీంతో వారు ఎవరెవరినీ కలుసుకున్నారనే దాన్ని గుర్తించడం కష్టమైన పని అని ఆరోగ్య శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm