అమరావతి : డాక్టర్ సుధాకర్ హైకోర్టును ఆశ్రయించారు. విశాఖ మానసిక ఆస్పత్రిలో వైద్యం సరిగా అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను వెంటనే వేరే ఆస్పత్రికి తరలించాలని సుధాకర్ అభ్యర్థించారు. కోర్టు పర్యవేక్షణలో వైద్యం జరపాలని సుధాకర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తనకు సరైన వైద్యం అందించడంలేదని, ట్యాబ్లెట్ల వివరాలను ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. వైద్యులు ఇస్తున్న ట్యాబ్లెట్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. పిచ్చోడిగా తనను నిరూపించేందుకు అనుగుణమైన మందులు వైద్యులు ఇస్తున్నారని, మానసిక ఆస్పత్రిలో తనకు సంబంధం లేని మందులు ఇస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా తనను మరో ఆస్పత్రికి రిఫర్ చేయాలని లేఖలో సుధాకర్ కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm