హైదరాబాద్: పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఓ పోలీసుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటన బీహార్లోని బెగుసరాయిలో చోటుచేసుకున్నది. పట్టణంలోని లోహియానగర్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుపై .. బైక్పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో పోలీసు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm