హైదరాబాద్ : కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ కు లెటర్ రాశారు. లాక్డౌన్ తో పేద, మధ్య తరగతి, వివిధ వర్గాల వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని వాళ్లకు ప్రభుత్వం అండగా ఉండాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి పలు డిమాండ్లతో కేసీఆర్ కు లేఖ రాశారు. ఇండస్ట్రీస్ కూడా మూతపడటంతో కార్మికులు, యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి సమయంలో ప్రభుత్వం అందరిని ఆదుకోవాలని కోరారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 9వ తేదీన తన ఇంట్లో ఒక రోజు నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.
Mon Jan 19, 2015 06:51 pm