విశాఖ : నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి మత్తు వైద్యుడు డాక్టర్ సుధాకర్పై సీబీఐ కేసు నవెూదు చేసింది. గత నెల 16న మద్యం మత్తులో విశాఖపట్నంలోని జాతీయ రహదారిపై గొడవ చేస్తున్నారని సుధాకర్ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసే క్రమంలో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని సుధాకర్ ఆరోపించారు. దీనిపై వివిధ ప్రజాసంఘాలు, రాజకీయపార్టీల నేతలు స్పందించి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలని ఆదేశించింది.హైకోర్టు ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా విచారణ జరుపుతున్న సీబీఐ తాజాగా డాక్టర్ సుధాకర్పై కేసు నవెూదు చేసింది. కానిస్టేబుల్ వెలగల వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నవెూదు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. ఘటన జరిగిన సమయంలో విశాఖ నాలుగో పట్టణ పోలీసులు 353, 427, 506 సెక్షన్ల కింద సుధాకర్పై కేసు నవెూదు చేశారు. ప్రస్తుతం దాని ఆధారంగానే సీబీఐ కేసు నవెూదు చేసింది. నేరపూరితమైన బలం ఉపయోగించి విధులకు ఆటంకం కలిగించారని, తుంటరి చేష్టలు, భయోత్పాతం సృష్టించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇవాళ సీబీఐ వెబ్సైట్లో ఎఫ్ఐఆర్ కాపీని అందుబాటులో ఉంచారు. హైకోర్టు ఆదేశానుసారం కేసులు నవెూదు చేస్తున్నట్టు సీబీఐ తెలిపింది. గత నెల 16 నుంచి డాక్టర్ సుధాకర్ విశాఖలోని మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm