హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి గురించి మరో షాకింగ్ విషయం బయటికి వచ్చింది. భారత్లో ఈ మహమ్మారి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 198 రకాలుగా రూపాంతరం చెందినట్లు జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జెడ్ఎస్ఐ) పరిశోధకులు తెలిపారు. ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోనే ఈ వైరస్ ఎక్కువగా రూపాంతరం చెందినట్లు వారు గుర్తించారు. దేశవ్యాప్తంగా కరోనాకు సంబంధించి 400 జన్యుక్రమాలను పరిశీలించిన జెడ్ఎస్ఐ శాస్త్రవేత్తలు.. వాటిలో 198 వేరియంట్లను గుర్తించారు. అంతర్జాతీయ డేటా ఆధారంగా మార్చి మొదటివారం, మే చివరి వారంలో వివిధ జన్యురాశులను విశ్లేషించిన వారు.. వీటిల్లో ఢిల్లీలో 39 రూపాలుగా, అహ్మదాబాద్లో60, గాంధీనగర్లో 13, తెలంగాణలో 55, మహారాష్ట్ర, కర్ణాటకలలో 15 రకాలుగా కరోనా వైరస్ రూపాంతరం చెందినట్లు గుర్తించారు. ఇక చైనా, ఐరోపాకు చెందిన కరోనా వైరస్ రకమే దేశంలో అధికంగా వ్యాప్తిలో ఉన్నట్లు పేర్కొన్నారు. దీని బట్టి ఈ వైరస్ ఎప్పుడు..? ఎలా.? వ్యాపిస్తుందో ఎవరికీ అంతుచిక్కట్లేదు.
Mon Jan 19, 2015 06:51 pm