తిరువనంతపురం: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేరళ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను కేరళ ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకు కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం రోజు కొత్తగా కేరళలో 82 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,494 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన 53 మందికి కరోనా సోకిందని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 19 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm