హైదరాబాద్ : పెళ్లి కూతురుకు కరోనా రావడంతో పెళ్లి ఆగిపోయింది తమిళనాడులోని కోవై జిల్లాలో. కరోనా లాక్డౌన్ ఉన్నటికీ నిబందనలను పాటిస్తూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు తమిళనాడుకు చెందిన ఓ జంట. గత నెల వివాహం నిశ్చయం కావడంతో ఉద్యోగ రీత్యా డిల్లీలో పని చేసే వధువు మే నెలలో తమిళనాడులోని వారి గ్రామానికి చేరుకుంది. డిల్లీ నుంచి వచ్చినట్లు తెలుసుకున్న అధికారులు వధువును క్వారంటైన్ చేసి కరోనా టెస్టులు నిర్వహించారు. దీంతో వధువుకు కరోనా ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ కావడంతో అధికారులు ఆమెను వైద్యం కోసం ఆసుపత్రికి తరళించారు. దీంతో జరగాల్సిన పెళ్లి కాస్త ఆగిపోయింది. అయితే వీరి పెళ్లి అనుకున్న సమయానికి జరగక పోవడం ఇదేమీ మొదటిసారి కాదు. కొద్ది రోజుల క్రితమే లాక్డౌన్తో, తిరిగి అమ్మాయిని క్వారంటైన్ చేయడంతో రెండు సార్లు ఆగింది. ఇక అమ్మాయికి క్వారంటైన్ గడువు ముగిసాక తిరిగి పెళ్లి చేసుకుందామనుకున్న ఈ జంటకు మళ్ళీ ఎడబాటు తప్పలేదు. అమ్మాయికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఇక పెళ్లి ఇప్పట్లో జరిగే అవకాశం లేకుండా పోయింది.
Mon Jan 19, 2015 06:51 pm