హైదరాబాద్ : దేశంలో సమాఖ్య స్పూర్తిని ప్రధాని మోడీ మంటగలుపుతున్నారి ఆర్మూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏ.జీవన్ రెడ్డి అన్నారు. ఆయన ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ సవరణ బిల్లుపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ప్రజలందరూ హర్షం వ్యక్తం చేసారని అన్నారు. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వకూడదన్న ఉద్దేశ్యంతోనే మోడీ ఈ బిల్లును తెస్తున్నారని విమర్శించారు. పవర్ తో పెట్టుకున్న వాళ్లంగా పవర్ లో లేకుండా పోయారిని బీజేపీకి చురకలంటించారు. మోడీకి ధైర్యం ఉంటే ఉచిత కరెంట్ ఇవ్వం, సబ్సిడీలు ఇవ్వం అని బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేసారు. కేసీఆర్ అందిస్తున్న రైతులకు ఉచిత కరెంట్ కార్యక్రమం దేశానికే ఆదర్శమన్నారు. రైతులు, పేదల సంక్షేమం అంటే మోడీ పడదు అందుకే ఇప్పటికీ మోడీ హయంలో ఒక్క సంక్షేమ పథకం కూడా అమలుకాలేదని ఎద్దేవచేసారు. బడాబాబుల మీద ఉన్న ప్రేమ వలస కార్మికులపై మోడీకి లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ఎంపీలపై కూడా పలు విమర్శలు చేసారు. ఇప్పటికైనా మోడీ విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. లేకపోతే బీజేపీకి మిగిలేది గుండా సున్నానే అని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm