హైదరాబాద్ : కరోనా లాక్ డౌన్ కారణంగా సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. సినీ కార్మికులకు ఆర్థిక సాయం కింద ప్రభుత్వం రూ.7500 ఇవ్వాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను అని కోరారు. ఈరోజు మంత్రిని కలిసిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి.. సినీ కార్మికులను ఆదుకోవాలని లేఖ అందించారు. లాక్ డౌన్ కారణంగా గత 3 నెలలుగా సినీ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులకు జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm