న్యూఢిల్లీ: నైరుతీ రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించడంతో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు నదులు వరద ప్రవాహంతో ఉప్పొంగుతున్నాయి. మరోవైపు పలురాష్ట్రాల్లోని గ్రామలు, లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన సీనియర్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో వరద పరిస్థితిపై అమిత్ షా వారితో సమీక్షించారు. వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లు, సహాయక చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు.
Mon Jan 19, 2015 06:51 pm