హైదరాబాద్: కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్(సీఐఎస్సీఈ).. ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్(ఐసీఎస్ఈ), ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్(ఐఎస్సీ) సెలబస్ను 25 శాతం మేర తగ్గించింది. 2020-21 విద్యా సంవత్సర సిలబస్ను 25 శాతం తగ్గించింది. సవరించిన సిలబస్ అధికారిక వెబ్సైట్ https://cisce.org/ లో లభిస్తుంది. 9 నుండి 12వ తరగతుల విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి తాజా సిలబస్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్త లాక్డౌన్, కోవిడ్-19 మహమ్మారి కారణంగా పాఠశాలలు గత మూడు నెలలుగా మూసివేయబడ్డాయి. అయినప్పటికీ సీఐఎస్సీఈ అనుబంధ పాఠశాలలు ఆన్లైన్ మోడ్లో తరగతులను తాత్కాలికంగా నిర్వహిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సిలబస్ను తగ్గించింది. 2020-21 విద్యాసంవత్సరాన్ని కుదించింది. కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం నష్టపోకుండా సిలబస్ను తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.
Mon Jan 19, 2015 06:51 pm