హైదరాబాద్: నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో కేంద్రం అంతకంతకూ పెంచుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ క్యాడర్తో ఉత్తమ్ ఫేస్ బుక్ వేదికగా లైవ్లో మాట్లాడారు. సోమవారం రాష్ట్రంలో అడ్డగోలుగా విధించిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తామన్నారు. మండల విద్యుత్ కార్యాలయాల ఎదుట నల్ల జెండాలతో ధర్నా చేయనున్నట్లు ఉత్తమ్ ప్రకటించారు. కొవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో విద్యుత్ బిల్లులను అడ్డగోలుగా వేశారన్నారు. రావాల్సిన బిల్లు కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగానే బాదారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జులై 6న రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారంపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగర వేయాలని టీపీసీసీ చీఫ్ సూచించారు. వాహనాలకు సైతం నల్ల జెండాలు కట్టుకోవాలన్నారు. నాన్ టెలిస్కోపిక్ విధానంలో తీసిన బిల్లులు పేదలకు భారమైందన్నారు. టెలిస్కోపిక్ విధానం కోసం కాంగ్రెస్ శ్రేణులు ఉద్యమ చేయాలన్నారు. బీపీఎల్ కుటుంబలకు పూర్తిగా కరెంట్ బిల్లులు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 04,2020 07:17AM