హైదరాబాద్: కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో చార్టెడ్ అకౌంటెంట్స్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రకటించింది. మే అటెమ్ట్ ను నవంబర్ అటెమ్ట్ లో విలీనం చేయాలని నిర్ణయించింది. ఫీజు పేమెంట్స్ తో పాటు కోర్సు పరమైన రాయితీలు కూడా తదుపరి అంటెమ్ట్ కు బదిలీ చేయబడతాయని బోర్డు తెలిపింది. గ్రూప్స్, సెంటర్స్ కూడా మార్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం మే 2 నుంచి 18 వరకు చార్టెడ్ అకౌంటెంట్స్ పరీక్షలు జరగాల్సి ఉన్నది. అయితే దేశంలో కరోనా లాక్డౌన్ విధించడంతో ఐసీఏఐ పరీక్షలు వాయిదా వేసింది. మళ్లీ జూన్ 19 నుంచి జూలై 4 వరకు పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. అయితే కరోనా కేసుల తీవ్రత మరింత పెరగడంతో ఎగ్జామ్స్ మరోసారి వాయిదా వేసి, జూలై 29 నుంచి ఆగస్గు 16 వరకు నిర్వహిస్తామని జూలై 4న ప్రకటించింది. కాగా, ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు భారీగా పెరగడం, నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సీఏ పరీక్షలు ఐసీఏఐ రద్దు చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm