అనంతపురం: పోలీసు స్టేషన్లోనే మందు కొట్టేశారు కానిస్టేబుళ్లు. వారు మద్యం తాగుతున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీతో బయటపడ్డాయి. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. హిందూపురం పట్టణంలోని టూటౌన్ పోలీసు స్టేషన్లో హెడ్ కానిస్టేబుళ్లు తిరుమలేశ్, నూర్మహ్మద్, కానిస్టేబుల్ గోపాల్నాయక్ పనిచేస్తున్నారు. హెడ్కానిస్టేబుళ్లిద్దరూ అనంతపురంలో నివాసముంటున్నారు. విధులకు హాజరైనప్పుడు పోలీసు స్టేషన్ పై అంతస్తులోని రెస్ట్ రూంలో బస చేసేవారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 4వ తేదీన వారిరువురితోపాటు కానిస్టేబుల్ గోపాల్నాయక్ కలిసి రెస్ట్ రూంలో బస చేశారు. సీజ్ చేసిన కర్ణాటక మద్యం సీసాల్లో కొన్ని తీసుకొని వారు అక్కడే మద్యం తాగారు. మొత్తం వ్యవహారం సోమవారం బయటకు వచ్చింది. మీడియాలో ప్రసారమైంది. ఈ ఘటన జిల్లాలో సంచలనమైంది. ఎస్పీ సత్యయేసుబాబు దీనిని సీరియ్సగా పరిగణించారు. వెంటనే దీనిపై పూర్తిస్థాయి విచారణ చేసి, నివేదిక ఇవ్వాలని పెనుకొండ డీఎస్పీ మహబూబ్బాషాను ఆదేశించారు. డీఎస్పీ స్టేషన్లో విచారించి, నివేదికను ఎస్పీకి అందజేశారు. గంటల వ్యవధిలోనే ఆ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారం జిల్లా పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది.
Mon Jan 19, 2015 06:51 pm