హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. కరోనా పాజిటివ్ వచ్చి లక్షణాలు తక్కువగా ఉంటె, పదిరోజులపాటు వైద్యం అందిస్తారు. ఇక వరసగా మూడు రోజులపాటు జ్వరం కనుక లేకుంటే వారిని డిశ్చార్జ్ చేస్తారు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిన తరువాత వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రి సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 1075 అనే హెల్ప్ నెంబర్ ను ప్రభుత్వం సిద్ధం చేసింది. వ్యాధి లక్షణాలు తక్కువగా ఉంది ఆక్సిజన్ ఆవసరమైతే వారిని జిల్లా కోవిడ్ ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ లక్షణాలు 3 రోజుల్లో తగ్గిపోతే మరో నాలుగు రోజుపాటు పరీక్షించి అప్పుడు ఇంటికి పంపిస్తారు. ఇకపోతే, జ్వరం, శ్వాసకు సంబంధించిన సమస్యలు లేనివాళ్లను ఎలాంటి పరీక్షలు లేకుండా ఇళ్లకు పంపిస్తారట. అయితే, ఇమ్మ్యూనిటి శక్తి తక్కువగా ఉండి, వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉంటె అలాంటి వారిని పూర్తిగా కోలుకున్నాకే తిరిగి ఇంటికి పంపుతారట. అప్పటి వరకు వారు ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తారు.
Mon Jan 19, 2015 06:51 pm