హైదరాబాద్ : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం, రహదారుల నాణ్యతను మెరుగుపర్చడం లక్ష్యంగా జాతీయ రహదారులకు ర్యాంకులు ఇవ్వాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. ర్యాంకుల కేటాయింపులో భాగంగా రహదారి సామర్థ్యానికి (హైవే ఎఫీషియన్సీ) 45 శాతం, భద్రతకు 35 శాతం, ప్రయాణికులకు అందుబాటులో ఉన్న సేవలకు 20 శాతం చొప్పున మార్కులు కేటాయిస్తారు. వీటితోపాటు రహదారులపై వాహనాల వేగం, టోల్ ప్లాజాల వద్ద తీసుకుంటున్న సమయం, శుభ్రత, మొక్కల పెంపకం, ప్రయాణికుల సంతృప్తి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఆయా అంశాల మదింపు పూర్తయిన తర్వాత దాన్ని సమగ్రంగా విశ్లేషించి ప్రతి రహదారి నాణ్యత, సేవల మెరుగుకు అవసరమైన నివేదిక రూపొందిస్తారు.
Mon Jan 19, 2015 06:51 pm