హైదరాబాద్: భవ్య క్రియేషన్స్ బేనర్లో హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ తన రెండో సినిమా చేయనున్నాడు. కొద్ది సేపటి క్రితం దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన రాగా, ఈ మూవీని వినోద్ అనంతోజు అనే ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్నాడు.ఇందులో రాజశేఖర్ కూతురు శివాత్మిక కథానాయికగా నటించింది. బిగిల్ ఫేమ్ వర్ష బొల్లమ్మ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి స్వీకర్ అగస్తీ సంగీతం అందిస్తున్నారు. 'మిడిల్ క్లాస్ మెలోడీస్' అనే టైటిల్తో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మరికొద్ది రోజులలో వెల్లడించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm