సికింద్రాబాద్ : నగరంలోని ఉజ్జయిని అమ్మవారి దర్శనాలు నిలిపివేశారు అధికారులు. సంప్రదాయ బద్ధంగా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఈ సారి బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 12, 13న ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. 12న అమ్మవారికి బంగారు బోనం, ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలను సమర్పిస్తారు. 13న రంగం ఉంటుంది. ఉత్సవాలను ప్రజలంతా వీక్షించేలా ఆలయం నుంచే ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆలయానికి వచ్చే దారులన్నీ మూసివేశారు అధికారులు. ఇక, అమ్మవారి బోనాల ఉత్సవాలు అధికారికంగా... అధికారులు, పండితుల సమక్షంలో నిర్వహించడం జరుగుతందని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm